పోస్ట్‌లు

హైద‌రాబాద్ లో BLive మూడో ఎక్స్ పీరియన్స్ స్టోర్ ప్రారంభం

చిత్రం
  భార‌త్ లో శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న మ‌ల్టీ బ్రాండ్ ఎల‌క్ట్రిక్ వెహికిల్ ప్లాట్ ఫామ్  BLive. ఈ సంస్థ త‌న మూడో EV ఎక్స్ పీరియన్స్ స్టోర్ ను రంగారెడ్డి జిల్లాలో ప్రారంభించింది. బాపూన‌గ‌ర్ లో దీన్ని ఏర్పాటు చేసింది. హైద‌రాబాద్ లోని ప్ర‌గ‌తిన‌గ‌ర్, హ‌ఫీజ్ పేట్ లో ఇప్ప‌టికే BLive ఎక్స్ పీరియన్స్ స్టోర్స్ అందుబాటులో ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌న దేశంలో 100కి పైగా స్టోర్స్ ఏర్పాటు చేయాల‌న్న‌ది BLive ల‌క్ష్యం. దీనిలో భాగంగానే రానున్న మూడేళ్ల‌లో హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో క‌నీసం 15 మల్టీ-బ్రాండ్ స్టోర్స్ అందుబాటులోకి తెచ్చేందుకు BLive స‌న్నాహాలు చేస్తోంది.   BLive EV ఎక్స్ పీరియన్స్  స్టోర్ ప‌లు ర‌కాల ఉత్ప‌త్తుల‌ను అందిస్తోంది. BLive  కొత్త‌గా ఏర్పాటు చేసిన స్టోర్ లో ఇన్ హౌస్ క్విక్  సర్వీస్  కియోస్క్, బ్యాటరీ స్వాపింగ్, EV ఛార్జింగ్  ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటి స‌దుపాయాలు ఉన్నాయి. Tags:  battery swap facilities, BattRE, BLive, e-bikes, E-Motorad, electric bicycles, electric two wheelers, ev, EV charging infrastructure, EV Store, Gemopai, Hero Lectro, Kinetic Green, LML

ఘ‌నంగా AR Rahman కుమార్తె వివాహం

చిత్రం
ప్ర‌ఖ్యాత సంగీత ద‌ర్శ‌కుడు, ఆస్కార్ అవార్డు గ్ర‌హీత AR Rahman కుమార్తె ఖతీజా రెహజాన్‌  వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఆడియో ఇంజ‌నీర్ రియాస్దీన్ షేక్ మహమ్మద్ ను ఆమె పెళ్లి  చేసుకున్నారు. ఖ‌తీజా ప్రింటెడ్ ఆఫ్ వైట్ డ్రెస్ లో త‌ళుక్కుమ‌న‌గా ... రియాస్దీన్ తెలుపు రంగు  షేర్వానీలో ధ‌గ‌ధ‌గ‌లాడారు. వారి మ్యారేజ్ ఫొటోను ఏఆర్ రెహ‌మాన్ త‌న సోష‌ల్ మీడియా  అకౌంట్ల‌లో పోస్ట్ చేశారు. భ‌గ‌వంతుడు ఈ కొత్త జంట‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరుతూ పెళ్లి ఫొటోను  అభిమానుల‌తో పంచుకున్నారు. అందులో ఖతీజా-రియాస్దీన్  తో పాటు రెహ‌మాన్, ఆయ‌న భార్య  సైరా భాను... వారి మ‌రో ఇద్ద‌రు పిల్ల‌లు ర‌హీమా & అమీన్ కూడా ఉన్నారు. రెహ‌మాన్ త‌ల్లి ఫొటో  కూడా అందులో ఉంది. మ‌రోవైపు, ఇది త‌న జీవితంలో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రోజని  ఖతీజా పోస్ట్ చేశారు. మ‌న‌సుకు ఇష్ట‌మైన వ్య‌క్తిని సొంతం చేసుకున్నాన‌ని తెలిపారు. అటు,  ఖతీజా-రియాస్దీన్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ప‌లువురు సినీరంగ ప్ర‌ముఖులు వారికి విషెస్ చెప్పారు. వారంద‌రికీ ఏఆర్ ర‌హ‌మాన్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Yadadri Temple History || యాదగిరి గుట్ట || Yadagirigutta

చిత్రం
శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం , యాదాద్రి భువనగిరి జిల్లా , Yadagirigutta Mandal   లో   ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయం. ఇది తెలంగాణలోని  మహా పుణ్య క్షేత్రాలలో ఈ ఆలయం  ఒకటి.  ఈ గుట్ట భువనగిరి మరియు రాయగిరి మధ్యలో ఉంది.     Yadagirigutta Temple History:   యాదర్షి అనే ఒక ఋషి ఉండే వాడు. ఆ ఋషి నరసింహ స్వామి భక్తుడు. అతనికి Lakshmi  Narsimha Swamy ని Direct గా చూడాలని కోరిక వచ్చింది. ఆ ఋషికి తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమవుతాడు అని ఆంజనేయస్వామి సలహా ఇస్తాడు. ఆంజనేయస్వామి సలహా మేరకు యాదర్షి తపస్సు చేసి స్వామి వారిని చూడగా ఆ ఉగ్ర నరసింహ రూపాన్ని చూడలేక శాంతి రూపంలో కనిపించమని యాదర్షి కోరుకోగా స్వామి వారు లక్ష్మి సమేతం గా దర్శనం ఇస్తాడు.  స్వామి వారు   "ఏం కావాలో కోరుకో" అని యాదర్షిని అడిగితే   శాంత మూర్తి రూపంలోనె కొండపై  కొలువై ఉండమని కోరాడు. ఆవిధంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కొండపై కొలువుదీరాడు. కొన్ని  సంవత్సరాల తర్వాత ఆ యాదర్షికి స్వామి వారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి మళ్ళీ  తపస్సు చేయగా అతని కోరిక మేరకు స్వామి వారు జ్వాలా నారసింహుడు, గండభేరుండ  నారసింహుడు, యోగ నారసింహు